భగవద్గీత కందానువాదం
భగవద్గీత అమర గాయకులు శ్రీ ఘంటసాల పాడిన శ్లోకాలకు స్వేచ్ఛానువాదం కింద పద్యాలలో 1.కందం శ్రీకంఠుని సుతుని దలచి శ్రీకృష్ణుని మదిని నిలిపి సేయగ గీతన్ చేకొంటిని సంకల్పము నా కమరును గాక శక్తి నాదు సృజనకున్ 2. కందం కందమనెడు ఛందములో నందకుమారుని యువాచ నా పలుకులలో వందనమిడి వ్రాసెద నర విందాక్షుడు మది నెలకొని విజ్ఞత నిడగాన్ 3.కందం వ్యాసుని భారత కథలో భాసిలు యీ గీత భీష్మపర్వము నందున్ దోసిలి యొగ్గుచు మౌనికి చేసెద నే తెనుగు సేత చేతము మురియన్ 4.కందం సారథివై యర్జునునకు భారత రణమందు ధర్మ పక్షము కృష్ణా ! చేరియు నడిపించిన నీ సారథ్యము వలయు నీద సంసార ఝరిన్ అంకితం 5.కందం ఏమరువక కల నైనను నా మది స్మరియింతు సత్యనారాయణులన్ నామ మిదియె మా గురువుల ప్రేమకు సతతము నమింతు విమలాత్మునకున్ 6.కందం అంకిలి దీరిచి యవగుణ పంకము మదినుండి బాపు పావనులగు మీ కంకిత మీయగ నా కృతి సంకల్పము జేసుకొంటి సద్గురువర్యా! అంకిలి..కలత 7.కం. మసలుచు నుండగ తమమున మసలక గురువర!తరింప మాకిల సరియౌ దెస జూపెదరిదె వ...