గీతా కంద మరందం -1(సంపూర్ణం)
➖➖➖➖➖➖➖➖➖
గీతా (కంద) మరందం
➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖
1. అర్జున విషాదయోగం
➖➖➖➖➖➖➖➖➖
శ్లోకం 1
ధృతరాష్ట ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ
కిమకుర్వత సంజయ || 1-1 ||
ప్రతి పదార్థం :-
సంజయ =ఓ సంజయా;
ధర్మక్షేత్రే= ధర్మభూమియైన;
కురుక్షేత్రే= కురుక్షేత్రమునందు;
యుయుత్సవః= యుద్ధము చేయు తలంపుగలవారై;
సమవేతాః= కూడినట్టి;
మామకాః =నా వారలును;
పాండవాశ్చైవ (పాండ వాః చ ఏవ) =పాండవులును;
కిమ్= ఏమి;
అకుర్వత= చేసిరి.
తాత్పర్యం :-
ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు పలికెను.ఓ సంజయా!నా వారలగు దుర్యోధనాదులును,పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధము చేయ కుతూహలముతో ధర్మభూమియైన ఆ కురుక్షేత్రమున జేరి ఏమి చేసిరి?
అనువాద పద్యం :-
1.కందం
దురము కొఱకు ధర్మమ్మగు
కురుభూమిని కూడినట్టి కుంతితనయులున్
మరి నా ప్రియసుతులు నచట
చరియించిన విధము దెలుపు సంజయ! నాకున్.||1-1||
దురము.. యుద్ధము
శ్లోకం 2.
దృష్ట్వాతు పాండవానీకం
వ్యూఢం దుర్యోధనస్తదా
ఆచార్యముపసంగమ్య
రాజా వచనమబ్రవీత్
టీక:-
సంజయ ఉవాచ= సంజయుడు చెప్పెను ;
తదా =అప్పుడు ;
రాజా= రాజగు ;
దుర్యోధనః= దుర్యోధనుడు ;
వ్యూఢం= వ్యూహములుగా అమర్చబడియున్న ;
పాండవానీకమ్= పాండవసేనను ;
దృష్ట్వా తు= చూచి (అటుపిమ్మట);
ఆచార్యమ్= ద్రోణాచార్యుని ;
ఉపసంగమ్య= సమీపించి ;
వచనమ్ =(ఈ చెప్పబోవు) వాక్యమును;
అబ్రవీత్ =పలికెను .
తాత్పర్యం :-
ధృతరాష్ట్రునితో సంజయుడిట్లు వచించెను.
అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా అమర్చబడి యున్న పాండవసేనను జూచి,తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.
అనువాద పద్యం
2.కందం
చూచియు పాండవ సేనను
యోచించుచు నీసుతుడు సుయోధను డధిపా!
తోచిన తన మాట దెలుప
నాచార్యుని ద్రోణుజేరి యతనికి ననియెన్.
శ్లోకం 3
Comments
Post a Comment