అరుణ కిరణం అరుణ గారి ఇంటర్వ్యూ https://youtu.be/89_Lgv-dBgI?si=o92n7vXh05Pw-BzD 2017 లో అరుణ గారి ఆశయఫలంగా రూపుదిద్దుకున్న నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఉద్దేశ్యాలను ఉటంకిస్తూ నేను రాసిన *నరసం ఆశయగీతం* నవ్యాంధ్ర రాష్ట్రాన రచయిత్రుల సంఘమిది కవయిత్రుల మదిలోపల తళుకుమన్న తలపొక్కటి నరసంగా ఈనాడిటు పురుడు పోసుకుంది గతకాలం సమీక్షించి నేటి స్థితిని వీక్షించి అందమైన భవితవైపు అడుగు కదపటానికై అతివలంత ఏకమై ఐక్యభావ వేదికై మా స్వప్నం సాకారం చేసుకొనగ శ్రమిస్తాం మొల్ల నుండి మొదలుకొని ఎల్లరు కవయిత్రులు కావ్యజగతినెల్ల తాము జ్యోతిర్మయ మొనరింపగ విరచించిన కావ్యవిరుల సాహితీ సౌరభాలు వెదజల్లే ప్రస్థానం అదే మా శుభాశయం పద్య వచన కవనము కవిత నవల గేయము సంప్రదాయ సాహిత్యం వైప్లవ్యం ఆధునికం మార్గమేదైనగాని సాధించిన అభ్యుదయం కలబోసుకుంటాము కదలి సాగిపోతాము సేవకు మేం ముందుంటాం సమానత్వ మాశిస్తాం స్త్రీలకొరకు స్పందిస్తాం న్యాయానికి నినదిస్తాం మానవీయ విలువలు మట్టిపాలు కానీయం సంఘహితం మా లక్ష్యం మా భూమిక సాహిత్యం పుస్తకాలు ప్రచురించి మేటి రచన సమీక్షించి సాహిత్య సభలు జరిపి సంస్థలత...
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 గేయ రామాయణం బాలకాండ (142 చరణాలు) ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సులు.మా ఇంటి పేరు జంగం. నా కలం పేరు సింహాద్రి జ్యోతిర్మయి. నేను 2002 వ సంవత్సరంలో గేయరామాయణం వ్రాశాను. స్వర్గీయురాలైన మా తల్లిగారు శ్రీమతి సింహాద్రి విశాలాక్షి గారికి అంకితంగా ఈ గేయరామాయణం రాయటం జరిగింది.దీనిని ఈ శ్రీరామ నవమి నుండి ముఖ పుస్తక మిత్రులందరికీ అందించాలనే సంకల్పం ఈ శుభోదయాన నాకు కలిగింది. ఈ గేయం దాదాపుగా వెయ్యి చరణాలు కలిగి ఉంటుంది.రాముడికి వెయ్యి నూట పదహార్లు సమర్పించాలని నా ఆశ.ఈ గేయాన్ని యథావాల్మీకంగా రాశాను.ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వచనం ఆధారంగా స్వీకరించాను. భద్రాచలం గురువులు నా గేయ రామాయణం విని నన్ను వనితా వాల్మీకి అని ప్రస్తుతించి ఆశీర్వదించారు. ఈ గేయాన్ని కస్తూరి రంగ రంగా ట్యూన్ లో పాడుకోవచ్చు.మిత్రులు నా ప్రయత్నాన్ని ఆదరించి ,ఆశీర్వదిస్తారని ఆశిస్తాను. అందరికీ ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మీ సింహాద్రి జ్యోతిర్మయి. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరా...
గీతా (కంద) మరందం భగవద్గీత (అమర గాయకులు శ్రీ ఘంటసాల పాడిన భగవద్గీత శ్లోకాలకు) స్వేచ్ఛానువాదం కంద పద్యాలలో గీతా (కంద) మరందం రచన.. సింహాద్రి జ్యోతిర్మయి న ర సం (నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఒంగోలు 9866014619 అంకితం మద్గురువర్యులు శ్రీ రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ (రిటైర్డ్ ఐఆర్ఎస్) గారికి సభక్తికంగా *గీతా (కంద) మరందం* ఒక మాట అందరికీ నమస్సులు.నా పేరు సింహాద్రి జ్యోతిర్మయి.నేను కవయిత్రిగా ఇప్పటివరకూ ఏవేవో పాటలు,పద్యాలు,కవితలు రాసుకుంటూ పోయాను.రాస్తూనే ఉన్నాను.ఇంతకుముందు భజగోవిందం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం,శ్రీవిష్ణు కందం ఇవన్నీ కందపద్యాలలో రాశాను.ఈ సంవత్సరం భగవద్గీత కందపద్యాలలోకి అనువాదం చేయాలని మనసులో ఒక స్ఫురణ కలిగింది.భగవద్గీత ఇంతకు ముందు చాలా సందర్భాలలో విన్నదే.చదివినదే, అక్కడక్కడా కొన్ని శ్లోకాలు నోటికి వచ్చినవే అయినా మా గురువుగారి నోటివెంట అనేక సందర్భాలలో గీతాశ్లోకాలు ,వాటి అంతరార్థాలు వినడం వల్ల గీతా శ్లోకాలు నేర్చుకోవాలి అని బలంగా అనిపించింది.దానికి ఒక సందర్భంకలిసివచ్చింది. నాకు చాలాకాలంగా ...
Comments
Post a Comment